స్వర్ణాంధ్ర స్వచ్ ఆంధ్ర కోసం పాటుపడతాం -ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు

Praja Tejam
0


 ఈరోజు అనంతపురం రూరల్ పరిధిలోని కురుగుంట గ్రామం నందు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ - 2 మరియు ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో  "నేషనల్ సర్వీస్ స్కీం స్పెషల్ క్యాంప్"  లో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర పై అవగాహన ర్యాలీ మరియు పరిసరాల పరిశుభ్రతను అవగాహన కల్పించడం జరిగింది.  ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ అధికారిని ఎం. విష్ణు ప్రియ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ లో భాగంగా కురుగుంట గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర పై అవగాహన ర్యాలీ నిర్వహిస్తూ స్థానిక పార్కు గ్రౌండ్ను శ్రమదానంతో విద్యార్థులంతా పరిశుభ్రం చేయడం జరిగింది. అలాగే ఇక్కడున్న ప్రజలకు తడి చెత్త పొడి చెత్త పై అవగాహన కల్పించడం జరిగింది .పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు తెలియపరుస్తూ పాల్గొన్న యువతతో పరిశుభ్రతపై గట్టిగా నినాదాలు చేస్తూ వీధులన్నీ తిరగడం జరిగింది. విద్యార్థులతో స్వర్ణాంధ్ర స్వచ్యాంద్రపై ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. కార్యక్రమానికి విద్యార్థులు ఎస్సార్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి జి. ప్రిసల్లా, బోయ రాశి, ఇండియన్ రెడ్ క్రాస్ వాలంటీర్ కే .మహేంద్ర ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సంతోష్ నాయక్, తిప్పేస్వామి,అభిషేక్ నాయక్ ,  మురళీకృష్ణ,హరిత,వెంకట సాయి,  ప్రశాంత్, శ్రీకాంత్,భవాని సంధ్య, గాయత్రి, ఎవెంజల్  తదితరులు మొదలైన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు  పాల్గొన్నారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">